దివ్యాంగుల హక్కుల చట్టం” పుస్తకావిష్కరణ చేసిన తహసీల్దార్
“దివ్యాంగుల హక్కుల చట్టం” పుస్తకావిష్కరణ చేసిన తహసీల్దార్
AP 39TV న్యూస్, కూడేరు:
ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు బుధవారం కూడేరులో తహసిల్దార్ శేషా రెడ్డిని కలిశారు .ఈ సందర్భంగా ఆయన చేత “2016 దివ్యాంగుల హక్కుల చట్టం” పుస్తకావిష్కరణ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్డార్ శేషారెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా దివ్యాంగుల భూ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే విచారణ జరిపి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం అనంతపురం ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ హరినాథ్ రెడ్డి , నియోజకవర్గ కార్యదర్శి కొర్రకోడు అల్లావుద్దీన్ ,మండల అధ్యక్షులు సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు