ముద్దలాపురంలో హౌసింగ్ డే
ముద్దలాపురంలో హౌసింగ్ డే
AP 39 TV న్యూస్ ,కూడేరు:
కూడేరు మండలం ముత్యాలపురంలో శనివారం అధికారులు హౌసింగ్ డే కార్యక్రమం చేపట్టారు . ఎంపీడీఓ ఎం.కె బాషా , తహసిల్దార్ సక్సేనా , హౌసింగ్ ఏఈ శేఖర్ లు జగనన్న లే- అవుట్ లో పర్యటించారు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు .తొందరగా నిర్మించుకుంటే ఇంటి నిర్మాణ దశను బట్టి బిల్లులు మంజూరు చేస్తామని వారు తెలిపారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుబ్బమ్మ , సర్పంచ్ ధనుంజయ,సచివాలయ ఉద్యోగులు ,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.