జల్లిపల్లిలో కేదర్నాథ్ ఆలయ ఆకారంలో వినాయక మండపం

జల్లిపల్లిలో కేదర్నాథ్ ఆలయ ఆకారంలో వినాయక మండపం

-మండపం ఏర్పాటుకు రూ 30 వేలు ఖర్చు

 

కూడేరు(సెప్టెంబర్ 19)AP 39 TV న్యూస్:-

కూడేరు మండల పరిధిలోని జల్లిపల్లిలో పీఏబీఆర్ డ్యాం కు వెళ్లే రోడ్డులో కొందరు యువకులు వినాయక చవితి పురస్కరించుకొని సోమవారం ఉత్తరాఖండ్ లోని కేదర్నాథ్ ఆలయ ఆకారంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండపం ఆకర్షణీయంగా నిలిచింది. మండపం ఏర్పాటుకు సుమారు రూ. 30 వేలు ఖర్చు అయినట్లు నిర్వాహకులు కిరణ్ , మహేంద్ర , ఎర్రిస్వామి , చందు , గౌతమ్ తెలిపారు. మంగళవారం గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మండపాన్ని వీక్షించి అందులో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేయించారు .నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్,

రిపోర్టర్,

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.