కూడేరు ఇప్పేరులో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు
కూడేరు ఇప్పేరులో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు
-వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి
కూడేరు(సెప్టెంబర్ 2)AP 39TV న్యూస్:-
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలను కూ, ఇప్పేరు గ్రామాల్లో ఆ పార్టీ నేతలు ,ప్రజాప్రతినిధులు , కార్యకర్తలు ,అభిమానులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలు ,బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి , రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి గురించి కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, కూడేరు సొసైటీ చైర్మన్ గంగాధర్, ఇప్పేరు సర్పంచ్ ఓబులేసు, వైస్ ఎంపీపీ దేవా, కో ఆప్షన్ సభ్యుడు సర్దార్, ఎంపీటీసీ సభ్యులు శివలాల్ రెడ్డి ,రమేష్, పార్టీ నేతలు తుప్పటి హరీష్ ,బైరెడ్డి రామచంద్రారెడ్డి ,తిమ్మారెడ్డి , విజయభాస్కర్ రెడ్డి , మంజునాథ్ రెడ్డి ,భార్గవ్ ,ఎర్ర నాగప్ప ,శంకర నాయక్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు