సంగమేశ్వరుడి ఉండి ఆదాయం లెక్కింపు
-11 నెలలకు రూ.5.46 లక్షల ఆదాయం
కూడేరు, మార్చి 6 (AP 39 TV న్యూస్):-
కూడేరులో ప్రసిద్ధిగాంచన శివ పార్వతుల జోడు లింగాల సంగమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి రామాంజనేయులు సమక్షంలో భక్తులు హుండీలో కానుకగా వేసిన నగదు లెక్కింపు చేపట్టారు. 11 నెలలకు గాను రూ.5.46 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో రమేష్ బాబు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్త రామదుర్గం క్రిష్టప్ప, సభ్యులు మెకానిక్ శంకర్ రెడ్డి , శ్రీనివాసులు, లీలావతి ప్రతిభాభారతి ,పద్మావతి, అలివేలమ్మ, అర్చకుడు మహేష్, ఆలయ సిబ్బంది హనుమాన్ సేవా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు