సబ్సిడీతో సమీకృత దాణా – వైద్యాధికారి శ్రీనివాసులు
సబ్సిడీతో సమీకృత దాణా – వైద్యాధికారి శ్రీనివాసులు
AP 39TV న్యూస్, కూడేరు:
ప్రభుత్వము సబ్సిడీతో సమీకృత దాణా అందజేస్తుందని మండల పశు వైద్యాధికారి శ్రీనివాసులు బుధవారం తెలిపారు. కేజీ మొత్తం ధర 1650 రూపాయలు. కాగా 60 శాతం సబ్సిడీతో కేజీ రూ.6.50 లతో ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క రైతుకు ,పశువుల పెంపకం దారునికి దాదాపు 1800 కేజీల వరకు దాణాని ఇవ్వడం జరుగుతుందన్నారు. కావాల్సిన వారు వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో ,పశు వైద్యశాలలో డబ్బు చెల్లించి దాణా పొందాలని ఆయన సూచించారు.