శభాష్ రామలింగమ్మ
-ఆస్పత్రికి వెళ్లి పింఛన్ నగదు పంపిణీ
కూడేరు,మార్చి 3(AP 39 TV న్యూస్);-
కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన వలంటీర్ రామలింగమ్మ ఆసుపత్రికి వెళ్లి లబ్ధిదారుకు పింఛన్ నగదు ఇవ్వడం జరిగింది. గ్రామానికి చెందిన ఈడిగ ఎర్రిస్వామి అనంతపురం హాస్పిటల్లో చికిత్స పొందందుతన్నాడు. విషయం తెలుసుకొని వలంటీర్ మాల రామలింగమ్మ ఆదివారం సొంత ఖర్చులతో హాస్పటల్ కు వెళ్లి పింఛన్ నగదు ఇచ్చింది. దీంతో ఎర్రిస్వామి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. వలంటీర్ ను గ్రామస్తులు , వైఎస్సార్ సీపీ మండల కన్వినర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, jcs కన్వీనర్ సెజాల దేవేంద్ర ,కాపు సిద్ధారెడ్డి తో పాటు పలువురు నాయకులు అభినందించారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు