12న నిర్వహించే ” వైఎస్సార్ చేయూత సభ “ను జయప్రదం చేయండి
-మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి
కూడేరు, మార్చి10(AP 39 TV న్యూస్):-
కూడేరులోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఈనెల 12న వైఎస్సార్ చేయూత, జగనన్న కాలనీలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేయు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం తెలిపారు.ఈ కార్యక్రమానికి చేయూత ,ఇంటి పట్టాల లబ్ధిదారులు ,వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు ,నేతలు, అనుబంధ సంఘాల నేతలు, అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు