YSR CP మండల మహిళా అధ్యక్షురాలుగా హేమలత
కూడేరు (అక్టోబర్ 17)AP 39 TV న్యూస్:-
వైఎస్సార్ సీపీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలుగా మరుట్ల-2. వ కాలనీకి చెందిన హేమలత (పరమేశ్వర్ రెడ్డి భార్య) ఎంపికయ్యారు. మంగళవారం కూడేరులో జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆమెకు మండల పార్టీ నేతలు , ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు