జగనన్న సురక్ష సర్వే పక్కాగా చేపట్టండి
– మండల స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ చౌదరి
AP 39TV,న్యూస్ కూడేరు:
జగనన్న సురక్ష సర్వేని పక్కాగా చేపట్టాలని మండల స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ చౌదరి సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు ఆదేశించారు. కూడేరు మండలం కమ్మూరులో జరుగుతున్న జగనన్న సురక్ష సర్వేని బుధవారం ఆయన తనిఖీ చేశారు . సర్వే ఏవిధంగా చేపడుతున్నది సిబ్బందితో ఆరా తీశారు.తర్వాత సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. 11 రకాల సేవలు ప్రజలకు ఉచితంగా అందాలన్నారు. దరఖాస్తు చేసుకున్నా ధ్రువీకరణ పత్రాలు అందలేదు అని ప్రజల నుంచి ఫిర్యాదులు రాకూడదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ముస్తఫా కమల్ బాషా ,సెక్రెటరీ మురళి , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు