కొర్రకోడు వలంటీర్లంతా రాజీనామా
కూడేరు,ఏప్రిల్12(AP 39 TV న్యూస్):-
కూడేరు మండల పరిధిలోని కొర్రకోడుకు చెందిన వలంటీర్లు అందరూ శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీవో ముస్తఫా కమల్ బాషాను కలిసి అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు .ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న లక్ష్యంతోటే తమ పోస్టులకు రాజీనామా చేసినట్లు వారు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సీపీ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు..
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు