బాధ్యతలు చేపట్టిన విఏహెచ్ఏ లు
కూడేరు,మార్చి 4 (AP 39 TV న్యూస్):–
పశు సంవర్ధక శాఖ విలేజ్ అనిమల్ హస్బండరీ అసిస్టెంట్లు(విఏహెచ్ఏ) ఏడుగురు సోమవారం బాధ్యతలు చేపట్టారు. వీరు ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ నాగభూషణ రెడ్డిని కలిసి జాయినింగ్ లెటర్స్ ను అందజేశారు. బాధ్యతలు చేపట్టిన వారిలో మరుట్ల రైతు భరోసా కేంద్రానికి యశోద, ఇప్పేరు కు రఘు వర్ధన్, కరుట్లపల్లికి ఎర్రిస్వామి , చోళసముద్రానికి సుబ్బరాయుడు , ఉదిరిపి కొండకు రాఘవ ,పి.నారాయణ పురానికి సర్దార్ భాష ఉన్నారు. మీరు ఎంపీపీ నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంచిగా సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకు రావాలని ఆయన సూచించారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు